Monday, 2 May 2016

ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు

ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు 

(రెబ్బెన వుదయం ప్రతినిధి) 130వ మేడే దినాన్ని కార్మికులు రెబ్బెనలో ఆదివారం  ఘనముగా జరుపుకున్నారు. గోలేటిలోని   సి పి  ఐ కార్యాలయంలో జెండా ఎగుర వేసి అనంతరం కార్యాలయం  నుంచి  బారి ఎత్తున కార్మికులు,ఉద్యోగులు  బైకుర్యాలి ప్రముఖ వీదుల గుండా   రెబ్బెన  బస్సు స్టాండ్ వరకు  నిర్వహించారు.అనంతరం రెబ్బెన లో సి పి ఐ  జిల్లా కార్యవర్గ సబ్యులు ఎస్ తిరుపతి అధ్వర్యంలో రెబ్బెన బస్టాండ్ ఏరియా లో మండల కార్యదర్శి పొన్న  శంకర్      జెండా ఆవిష్కరించారు.  అనంతరం పలు నాయకులు మాట్లాడుతూ మే 1తేదిన కార్మికులు   కార్మికుల హక్కుల దినోత్సవం కాబట్టి కార్మిక హక్కుల దినం కావడంతో కార్మికుల హక్కులకై పొరాటాలు చేయాలని,1కార్మికులు ఏకం కావాలని ఐక్యముగా వుండాలని  పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోఎ ఐ టి యు సి, ఎ ఐ ఎస్ ఎఫ్, సి పి ఐ నాయకులు బోగే ఉపేందర్,దుర్గం రవీందర్ ,రాయిల్ల నర్సయ్య ,పుదరి సాయి, శంకర్,శ్రీనివాస్ తదితర కార్మికులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment