ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలి
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన గ్రామా పంచాయితి లో ఇంటింట మరుగుదొడ్లు నిర్మాణ క్రమంలో మంగళ వారం నాడు వార్డ్ మెంబర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశం లో సర్పంచ్ పెసరి వెంకటమ్మ మాట్లాడుతూ ఇంటింట మరుగుదొడ్లు నిర్మించాలని నూతనంగా ప్రవేశపెట్టిన ఓ డి ఎఫ్ పథకంలో ఇంటింటా సర్వే చేసి మరుగుదొడ్లు లేని వారి దరకాస్తులు వాటిని ఎం పి డి ఓ వారికీ పంపిస్తాం అన్నారు. అలానే పారిశుద్యం లో బాగంగా ప్రతి ఒక కాలనీలో మురికి కాలువలు శుబ్రం చేపిస్తున్నాం అన్నారు. ఈ సమావేశం లో పంచాయితి కార్యదర్శి మురళీధర్, వార్డ్ మెంబర్లు చిరంజీవి గౌడ్ , ఆత్మకూరి నరేష్ , కళావతి , బొడ్డు యశోద , తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment