Tuesday, 17 May 2016

వినూత్న రీతిలో ఫీల్డ్ అసిస్టెంట్ల దీక్ష

  వినూత్న రీతిలో  ఫీల్డ్ అసిస్టెంట్ల దీక్ష 


(రెబ్బెన వుదయం ప్రతినిధి);  రెబ్బెనలో   ఎమ్ పి డి ఓ కార్యాలయం ముందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు చేపటిన  నిరవదిక సమ్మె మంగళవారానికి 8వ   రోజుకు చేరింది. మూతికి నల్లటి వస్రం కట్టుకొని  నిరసన తెలిపారు.  వీరికి  ఎ ఐ వై ఎఫ్ మండల అద్యక్షుడు జాడి తిరుపతి మద్దతు తెలిపారు.    అనంతరం మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టంట్ లకు  కనీసం వేతనం 15000 చెల్లించాలని అన్నారు,  వీరికి  మండల బదిలీ ఏర్పాటు చేయాలనీ అలాగే   రేగ్యులర్ చేయాలనీ అన్నారు.    రాష్టప్రబుత్వం  అధికారంలోకి రాక ముందు ఉద్యోగులను అన్నివిదాలుగా ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్డున పడేయడం జరిగినది  కావున  ఫీల్డ్ అసిస్టెంట్లు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.  ఉపాది హామీ కులీల ను 200 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. ఈ సమ్మెలో వవ్యసాయ కార్మిక సంఘం మండల అద్యక్షుడు అనుముల రమేష్ ,  ఫీల్డ్ అసిస్టంట్ లు   ఎ . తుకారం, డి .గణపతి  ఎ . ఫైకయ్య , స్వప్న,   మొగిలి, ఎమ్ . వెంకటేశం, తుకారం,కె.తిరుపతి,  ,దేవానంద్ జి . తిరుపతి ఉన్నారు. 

No comments:

Post a Comment