కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 28 ; మేరు కులస్తులకు సబ్సిడీ పై కుట్టు మిషన్లు అందించాలని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మరియు ప్రతి మేరుకు ఐదు ఎకరాల భూమి, ప్రభుత్వం తరపున రాయితీలను ప్రకటించాలిని రెబ్బెన మండల మెరు సంఘం అధ్యక్షులు బొమ్మినేని శ్రీధర్ మేరు, ప్రధానకార్యదర్శి రాయిలా నర్సయ్యలు అన్నారు. బుధవారం కొమురంభీం జిల్లా రెబ్బెన మండలంలో టైలర్స్ డే సందర్భంగా మేరు కులస్తులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడీ మేడ్ వస్త్రాల తాకిడికి మేరు కులస్తుల కులవృత్తి చాల దయనీయంగా మారిందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా మేరు కులస్తుల సమస్యలపై ద్రుష్టి సారించి ఆదుకోవాలని అన్నారు. మేరు కులస్తులకు సబ్సిడీ పై కుట్టు మిషన్లు అందించాలని అన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రతి మేరుకు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు. రెబ్బెనలో మేరు సంఘ భవనానికి పది హేను గుంటల భూమిని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో , మేరు సంఘం సభ్యులు బొమ్మినేని మల్లయ్య, కీర్తి మోహన్, రాపర్తి అశోక్, గాంధే రామకృష్ణ, ఆత్మకూరు నరేష్, గాంధే ప్రభాకర్, సాగర్ మారిశెట్టి, గాంధే సుధాకర్, కీర్తి రాము,తెరాస జిల్లా నాయకులు మోడెమ్ సుదర్శన్ గౌడ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి భోగే ఉపేందర్, తెరాస యువ నాయకులూ వినోద్ జైస్వాల్, మోడెమ్ రాజా గౌడ్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment