కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 23 ; రెబ్బెన మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2018 క్రీడా మరియ వీడ్కోలు ఉత్సవం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు కళా ప్రదర్శనలతో అలరించారు. కళాశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువును కస్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలను సాదించగలుతార న్నారు . పరీక్షల సమయంలో మానసిక వత్తిడికి గురికాకుండా ప్రశాంత మనస్సుతో ఉండాలన్నారు. రెబ్బెన గ్రామ సర్పంచ్ పేసరి వెంకటమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్ధి పరీక్షలలో మంచి ప్రతిభ కనపర్చి రెబ్బెన పట్టణ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు ఈ సందర్బంగా కళాశాల సిబ్బంది విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆ తర్వాత నిర్వహించిన నృత్యాలు చూపరులను ఎంతగానో అలరించాయి , ఈ కార్యక్రమంలో కళాశాల బోధనా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment