Saturday, 24 February 2018

తీవ్ర అలసటతో ఊపిరాడక చుక్కల దుప్పి మృతి

 
 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 24 ; చుక్కల దుప్పి పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోవడం జరిగిందని జోడేఘాట్ రేంజ్ అటవీ అధికారి మహేందర్ తెలిపారు.  కొమురంభీం జిల్లా  జోడేఘాట్ మండలం ధనోరా గ్రామంలోకి శనివారం ఉదయం సమయంలో  సమీప అడవినుంచి ఓ మెగ చుక్కల దుప్పి పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోవడం జరిగిందని, పశువైద్యాధికారి విశ్వజిత్ దుప్పిని  పరిశీలించి చాల ఎక్కువ దూరం పరిగెట్టడం వలన అలసటతో  ఊపిరాడక మరణించినట్లు ధృవీకరించారు. జోడేఘాట్ ఫారెస్ట్  ఆఫీసర్  మహేందర్ పై అధికారులకు సమాచారమిచ్చి  పై అధికారుల సూచనపై గ్రామస్తుల సహకారంతో దుప్పిని దహనం చేయటం జరిగిందని తెలిపారు. 

No comments:

Post a Comment