Friday, 23 February 2018

పనులను సకాలంలో పూర్తిచేయాలి ; కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

పనుల పురోగతిపై సమీక్ష సమావేశం



కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 23 ;  జిల్లాలో  సి బి ఎఫ్ నిధులతో మంజూరైన పనులు ఇప్పటికి  తొంబై  శాతం పూర్తి అయ్యాయని, మార్చ్ ముఫై ఒకటి కల్లా మిగతా పది  శాతం పనులు నాణ్యతలో రాజీపడకుండా నిర్ణిత గడువులోగా పూర్తి  చెయ్యాలని అధికారులను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్   పాటిల్ ఆదేశించారు.  శుక్రవారం  ఎం పి , ఎం ఎల్ ఏ   సి బి ఎఫ్ నిధులతో మంజూరైన పనుల పురోగతిపై సమీక్షా  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తహసీల్దార్ లు, ఎంపీడీఓలు సమన్వయంతో    పనులు నాణ్యతలో రాజీపడకుండా నిర్ణిత గడువులోగా పూర్తి  చెయ్యాలని అధికారులను ఆదేశించారు.పనులు పూర్తిచేయకపోతే అధికారులపై కఠిన చేర్యలుంటాయన్నారు.పనిచేసి పనులు పూర్తి చేయాలన్నారు.   అసలు పనులు మొదలుపెట్టని వాటి రద్దుకు ప్రతిపాదనలు  పంపాలన్నారు. . ఈ పనులు పూర్తిచేస్తే మిగతా నాల్గవ విడత నిధులు మంజూరవుతాయన్నారు . అధికారులు పనుల పురోగతిపై  ప్రతివారం నివేదికలు పంపాలన్నారు.  ఈ సమీక్షాసమావేశంలో సీ  పి  ఓ ఆర్ క్రిష్నయ్య, ఎంపీడీఓలు, ఆర్ డబ్ల్యూ ఎస్  మరియు ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment