Tuesday, 27 February 2018

పర్సనంబాల పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి


 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 27 ;  అసిఫాబాద్ మండలంలోని పర్స నంబాల ప్రాథమికోన్నత  పాఠశాల ను జిల్లా విద్యాధికారి ఎం ఏ రఫీక్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు.అన్ని తరగతుల విద్యార్థులను విద్యా ప్రమాణాల స్థాయిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. హరితహారంలో నాటిన  మొక్కలు సంరక్షిస్తున్న విషయంలో, మరియు విద్యా ప్రమాణాల విషయంలో పాఠశాల సిబ్బంది కృషిని మెచ్చుకున్నారు. సెలవులో ఉన్న ఉపాధ్యాయుల సెలవు పత్రాన్ని, అందరి పాఠ్య ప్రణాళికల పుస్తకాల గురించి ఆరా తీశారు. సందర్శన సమయంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు హేమంత్ షిండే, ఉపాధ్యాయులు దేవాజి, రజిత,కుమార్ లు హాజరై ఉన్నారు. జిల్లా విద్యాధికారి తో పాటు నోడల్ అధికారి ఎం ఏ జబ్బార్ పాల్గొన్నారు .

No comments:

Post a Comment