Wednesday, 28 February 2018

కందుల కొనుగోలు కేంద్రాల మూసివేత

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 28 ; జిల్లాలోని నాలుగు కేంద్రాలలో కందులు కొనుగోలు గురువారం  తో ముగియనున్నందున రైతులు దీనిని గమనించగలరని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్  పాటిల్  ఒక ప్రకటనలో  తెలిపారు .కో ఆపరేటర్ మార్కెటింగ్ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం గురువారం  వరకు మాత్రమే కందులు కొనుగోలు చేయాలని అన్నారు కందులు కొనుగోలు కేంద్రాలైన ఆసిఫాబాద్,  జైనూర్, కాగజ్ నగర్ , సిర్పూర్ యు లో రేపటి నుంచి కందులు కొనుగోలు నిలిపివేయడం జరుగుతుందన్నారు రైతులందరూ దీనిని గమనించి కందులను కొనుగోలు  కేంద్రాలకు తీసుకు వెళ్ళవద్దని  తెలిపారు.

No comments:

Post a Comment