


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 13 ; మహా శివరాత్రి సందర్భంగా కొమురంభీం జిల్లా లోని ఈజ్గం ఆసిఫాబాద్, కెరిమెరి, జైనూర్, కగజనగర్, రెబ్బెన, గోలేటి, మండలాలలోని లోని శైవ క్షేత్రాలు శివ నామ స్మరణతో మంగళవారం మరు మ్రోగాయి . రెబ్బెన మండలము లోని నంబాల గ్రామము లో గల ప్రసన్న పరమేశ్వర ఆలయము జాతర రంగ రంగ వైభవంగా సాగింది . ఉదయము పూట నుండే భక్తులు తండోప తండాలుగా మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎడ్ల బండ్లపై, , మోటారు సైకిళ్లపై తరలి వచ్చారు భక్తులు . కోరిన కోరికలను తీర్చాలని మొక్కుకున్నారు. ముందుగా శివ పార్వతుల కళ్యాణం ఆలయ కమిటి ఆధ్వర్యములో నిర్వహించారు . కళ్యాణం ఎంతో కనుల పండుగగా సాగింది .ఈ కళ్యాణములో భక్తులు కుంకుమ పూజలు భక్తి శ్రద్దలతో చేశారు . ఈ పూజలలో దంపతులు స్వామి వారి కళ్యాణం లో పాల్గొన్నారు. . స్వామివారికి ప్రత్యక పూజలు నిర్వహించారు.

ఈ జాతర లో వచ్చిన భక్తులకు కొంతమంది దాతలు అన్నప్రసాద వితరణ గావించారు. . భక్తుల కు ఎలాంటి అసౌ కర్యాలు కలగకుండా ఆలయ కమిటి అన్ని చర్యలు చేపట్టారు . అర్ టి సి సంస్థ భక్తుల రవాణా కొరకు ప్రత్యక బస్సులు నడిపారు .ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగ కుండ పోలీసుశాఖవారు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు . .
కన్నుల పండుగగా రధోత్సవం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 13 ; జిల్లావ్యాప్తంగా పరమేశ్వరాయలలో మంగళవారం సాయంత్రము శివ పర్వతుల రధోత్సవం ఎంతో కనుల పండగగా జరిగింది . ఈ కార్యక్రమంలో లో భక్తులు తండోప తండాలుగా పాల్గొన్నారు . ఆలయము చుట్టూ స్వామి వారి రథాన్ని భక్తులు శంభో శంకర అంటూ రధోత్సవం లో పాల్గొన్నారు. . శివాలయ ప్రాంగణము శివ నాదము తో మరు మ్రోగింది . అనతరము భక్తులు శివ పార్వతుల కు నైవేద్యము సమర్పించారు . సాయంత్రము శివాలయము లో భక్తులు భజనలు , కీర్తనలు పాడుతూ భక్తి పారవశ్యములో మునిగారు. రాత్రి ఏర్పాటు చేసిన స్వామి వారి దీపాలంకరణ భక్తులను మంత్ర ముగ్దులను చేసింది . అనంతరము భక్తులు శివాలయం వద్ద జాగారణ చేస్తూ శివ స్మరణతో జాగరం చేస్తూ గడిపారు.
No comments:
Post a Comment