Thursday, 22 February 2018

హాల్ టికెట్స్ కై వేధిస్తున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 22 ; ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు  విద్యార్థుల అడ్మిషన్ సమయంలో స్కాలర్ షిప్  డబ్బులతో అడ్మిషన్ చేసుకుని తీరా హాల్ టిక్కెట్లు ఇచ్చే సమయంలో ఐదువేల   రూపాయలు ఫీజు కట్టమని లేకుంటే హాల్ టిక్కెట్లు ఇవ్వమని వేధిస్తున్నట్లు జిల్లా ఏబీవీపీ  కన్వీనర్ ఎలాగతి  సుచిత్  ఆరోపించారు. గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ   ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు  హాజరుకానున్న విద్యార్థులకు హాల్ టికెట్స్  ఇవ్వకుండా వేధిస్తున్న  ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు   విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వాలని  లేనిచో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని అన్నారు.ఈ     సమావేశంలో తెలంగాణ ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోసరి మహేష్ వసతి గృహాల కన్వీనర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment