Tuesday, 6 February 2018

సిబ్బంది లేని రెబ్బెన మండల కార్యాలయం

  
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 6 ;  రెబ్బెన మండల కార్యాలయం గత రెండు నెలలుగా మూతపడిందని  ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, కోశాధికారి రాయిల్లా నర్సయ్య, టి ఎన్  టి యు సి  వైస్ ప్రెసిడెంట్ సొల్లు లక్ష్మీ, సెక్రెటరీ పుదరి సాయి కిరణ్  లు  మంగళవారం  అసిఫాబాద్  రెవెన్యూ డివిషనల్ అధికారికి  వినతి పత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ కొమురం భీం జిల్లా  రెబ్బెన మండలం మండల కార్యాలయంలో గత రెండునెలలుగా రెవెన్యూశాఖ అధికారులు మరియు సిబ్బంది లేకపోవడంతో   గత రెండు నెలలుగా  ఆసరా పెన్షన్ అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మండల కార్యాలయమెప్పుడు మూసేసి  ఉంటుదన్నరు. 

No comments:

Post a Comment