కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 9 ; జాతీయ నులి పురుగుల నిర్ములన దినోత్సవం సందర్బంగా శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, అంగన్వాడిలలోని ఒకటి నుండి19 సంవత్సరాలలోపు చిన్నారులకు, విద్యార్థులకు, నులి పురుగు నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు చిన్న పిల్లలకు, విద్యార్థులకు నూలిపురుగుల మాత్రలు వేయించడం వలన రక్తహీనత సమస్య సమసిపోవడం తో పాటు, సంపూర్ణ శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. నులి పురుగుల ఓ పరాన్న జీవి అని అన్నారు. ఇది మనుషుల పేగుల్లో నుంచి పోషకాలను గ్రహిస్తాయని ఇవి చిన్నారుల పాలిట అత్యంత ప్రమాదకరమైన ప్రాణులని, మొదట ఏలిక పాములుగా పుట్టి, నులి పురుగులుగా ఎదిగి, కొంకి పురుగులుగా మారుతాయి. ఇలా మూడు దశల్లో వ్యాప్తి చెందే పురుగులు ఆరోగ్యాన్ని హరిస్తాయిన్నారు ప్రతి పాఠశాలలో, అంగన్వాడి కేంద్రాలలో తప్పని సరిగా నులిపురుగు మాత్రలను పిల్లలకు వేయాలని, 1 సం,, నుంచి 3 సం,, పిల్లలకు సగం మాత్ర వేయాలని అదేవిధంగా 3 సం,, నుంచి 19 సం,, పిల్లలకి ఒక్క మాత్ర వేయాలని అన్నారు. భోజనం చేసిన అరగంట తరువాత మాత్రను చ ప్పరించాలని అన్నారు.ప్రత్యేకంగా శిక్షణ పొందిన కార్యకర్తలచే మందులు వేయించారు.
No comments:
Post a Comment