రేషన్ డీలర్లతో సమావేశమైన తహసీల్దార్
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 12 ; లబ్దిదారులకు మరియు రేషన్ డీలర్లకు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ పాస్ విధానంను ప్రారంభించినట్లు రెబ్బెన మండల తహసీల్దార్ సాయన్న అన్నారు. అవలంబించి సకాలంలో సరుకులు అందించాలని తహశీల్దార్ సాయన్నకోరారు. . కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తహశీల్దార్ సాయన్న మాట్లాడుతూ లబ్ది దారులకు సకాలంలో ఈ పాస్ విధానంలో సరుకులు అందించాలని రేషన్ డీలర్లకు సూచించారు. రేషన్ డీలర్లు ఈ పాస్ విధానం లోఉన్నసమస్యలను వివరించగా, డీలర్ల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికై ప్రయత్నం చేస్తానన్నారు.. ఈ సమావేశం లో ఉప తహశీల్దార్ విష్ణు ,రెవెన్యూ సిబ్బంది ఉమ్లాల్ ,రేషన్ డీలర్లు శ్రీపతి, మురళి ,సంతోష్ ,శెంకర్ ,తిరుపతి,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment