Wednesday, 14 February 2018

జ్ఞాపక శక్తిపై విద్యార్థులకు అవగాహన సదస్సు

కొమురం భీం ఆసిఫాబాద్ (మా  ప్రతినిధి) ఫిబ్రవరి  14 ;  రెబ్బెన మండలకేంద్రములోని సాయి విద్యాలయము ఇంగ్లీష్ మీడియం  హైస్కూల్ (ఎస్వి స్కూల్)లో బుధవారం విద్యార్థుల జ్ఞాపకశక్తి పెంపొందించుటకు మరియు వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. . ఈ సందర్భంగా గురువు ప్రసాద రాజు (,అసిస్టెంట్ ఇంజనీర్ కోల్  క్వాలిటీ కంట్రోల్ - కడప)  మాట్లాడుతూ విద్యార్థులు తమ చెవులను వ్యతిరేక  చేతి బొటనవ్రేలుతో పట్టుకొని 7 లేదా 14 లేదా 21 గుంజిళ్ళు తీయాలని అన్నారు. ఇలా చేయడంవలన  చెవుల దగ్గర ఉండే  నరాలు మెదడుకు అనుసంధానమై ఉండటం మూలాన జ్ఞాపకశక్తి పెరుగు తుందన్నారు.ప్రతి రోజు ఉదయం పూట క్రమము తప్పకుండ చేస్తే ఫలితం ఉంటుందని అన్నారు . ప్రసాద రాజు  విద్యార్థులకు చేయించి చూపించారు .   ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి , ప్రధానోపాధ్యాయులు దీకొండ సంజీవ్ కుమార్, ఉపాధ్యాయులు ,విద్యార్థులు   పాల్గొన్నారు.  

No comments:

Post a Comment