కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 28 ; గ్రామంలోని ప్రజలందరూ ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ఖైర్గం మరియు నవేగం గ్రామాల్లో పర్యటించి మరుగుదొడ్ల నిర్మాణాల పనితీరులను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులనుద్దేశించి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు ఖైర్గం లో మూడు వందల మరుగుదొడ్ల నిర్మాణ పనులు నవేగం లో రెండొందల మరుగుదొడ్లు నిర్మాణాల పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తి చేయడానికి సిమెంట్ అందరికీ అందుతుందని ఎవరూ వెనకడుగు వేయరాదని అన్నారు జిల్లాను మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ ఫై డి వెంకట్, రెబ్బెన ఎంపీపీ సంజీవ్ కుమార్, జడ్పీటీసీ అజ్మిరా బాబు రావు, గ్రామా సర్పంచులు, సులోచన కమలాబాయి, మ్పదోసత్యనారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment