Tuesday, 20 February 2018

మిషన్ కాకతీయ మరమత్తుల వల్ల పంటలకు సాగు నీరు ; ఎంపిపి సంజీవ్ కుమార్

  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 20 ;  మిషన్ కాకతీయ పనులలో  చెరువుల పునరుద్దరణ ,మరమత్తుల వల్ల సాగు భూములకు నీరు అంది రైతులకు  మేలు జరుగుతుందని  ఎంపిపి కర్నాధం సంజీవ్ కుమార్ అన్నారు. రెబ్బెన మండలం లో మంగళవారం నాల్గవ  విడత  మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రైతులకు సాగు నీరు అందించలానే ముఖ్య ఉద్దేశంతో చెరువుల మరమత్తుల పనులు చేపట్టడం జరిగిందన్నారు. రెబ్బెన ముచ్చెరువు   24 లక్షల తో మరియూ పులికుంట గ్రామ పోచమ్మ చెరువు 23 లక్షలతో పనులను ప్రారంభించారు.   ప్రజల సంక్షేమ ద్యేయంగా  పంట పొలాల అభివృదికై నీటి సమస్య లేకుండా చెయ్యడానికై సీఎం కేసీఆర్  మిషన్ కాకతీయ పనులు చేపట్టడం జరిగిందన్నారు ఇందులో భాగంగా మన మండలం లోని ప్రతి గ్రామంలో కూడా మిషన్ కాకతీయ పనులను చేపట్టి పూడికతీత మరియూ నీటి సరఫరా నిమిత్తము కేనాల్స్ కూడా కట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అజ్మిర  బాబు రావు  , సర్పంచ్ గజ్జెల సుశీల, తెరాస మండల అధ్యక్షులు  శ్రీధర్ రెడ్డి సింగల్ విండో డైరెక్టర్లు సత్యనారాయణ, పేసర్ మధునయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment