Tuesday, 27 February 2018

రసాయనం వద్దు సేంద్రియ రంగులు ముద్దు.

 
 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 27 ;  హోలీ పండుగ నాడు ప్రజలు రసాయనాలతో తాయారు చేసిన రంగులు కాకుండా సేంద్రియ రంగులనే వాడాలని బిజెవైఎం జిల్లా అధ్యక్షులు కాండ్రే విశాల్ అన్నారు . మంగళవారం స్థానిక బిజెవైఎం కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో  మాట్లాడారు.  హిందూ ధర్మ సంస్కృతి ప్రకారం హోలికి ఒక ప్రత్యేక విశిష్టత ఉందన్నారు చిన్ని కృష్ణుడు బృందావనం లో బాల్యం లో చేసిన కార్యక్రమాలని పురస్కరించుకొని ఈ పర్వదినాన్ని రంగులతో పెద్ద చిన్న తేడా లేకుండా మనషుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని మర్చి ఒకరికి ఒకరు రంగులు పూసుకొని హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నారు. కావున ప్రజలంతా రసాయనాలతో తాయారు చేసిన రంగులు కాకుండా సేంద్రియ రంగులనే వాడాలని తెలిపారు. ఈ సందర్బంగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో కాండ్రే నిర్మల,మేకర్తి గోపాల్ ,గడ్డల మల్లన్న,మేకర్తి ముత్తయ్య ,సుందర్ సింగ్ నాయక్ ,కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment