Friday, 2 December 2016

అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు

అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల పరిది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని రెబ్బెన తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ అన్నారు , శుక్రవారం తహశీల్ధార్ కార్యాలయములో ఆయన మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణము కోసము , ప్రభుత్వ పనులకు , మిషన్ భగీరథ పనులకు ఇసుకకు అనుమతులు ఇవ్వబడునని తెలిపారు . ఒక్కొక్క  ట్రిప్పుకి  120 /-  రూపాయలు బిల్లు కట్టాలని , ఒక్కొక్క వే బిల్లుకు ఒక్క ట్రిప్పు  మాత్రమే అనుమతి ఇవ్వబడునని పేర్కొన్నారు . ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలతో పాటు జరిమానా, శిక్ష తప్పదని తెలిపారు.

No comments:

Post a Comment