ఘనంగా క్రిస్మస్ వేడుకలు
కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 25; క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని రెబ్బెన, గంగాపూర్, గోలేటి, నంబాలా, ఇంద్రానగర్ లలో ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరాలైన చర్చిలు ప్రార్థనల తో పులకించాయి. తెరాస నాయకులూ దుస్తులు మిఠాయిలు పంచి క్రిస్మస్ వేడుకలలో పాలుపంచుకున్నారు అలాగే పలు చర్చిలలో ఫాస్టర్లు ఇచ్చిన సందేశం క్రైస్తవ సోదర ,సోదరీమణుల్లో శాంతి, దయ ,కరుణ, జాలీ అనే అంశాలు ప్రభావితం చేసేవిధంగా వున్నాయి. దీంతోపాటు చర్చిలను పలు ప్రాంతాల్లో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. కాగా పలువురు పాస్టర్లు అబాగ్యుల కోసం, ప్రపంచం అంతా ప్రశాంతంగా వుండాలని, ప్రకృతి వైపరిత్యాలనుంచి, మత ఘర్షణల నుంచి, కుల, జాతి విబేధాల వల్ల ప్రజలకే కాదు ఏప్రాణికి నష్టం, కష్టం కలుగకూడదని, ప్రతి ఒక్కరూ కరుణ. జాలి కలిగి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా తాను సంపాదించిన సొమ్ములో కొంతైనా దానం చేసి పేద ప్రజలను ఆదుకోవాలని, సమాజ సేవలో పాలుపంచుకోవాలని, క్రీస్తు చూపిన మార్గంలో ప్రయాణించి శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. కాగా ఈ వేడుకల్లో వున్న క్రైస్తవ సోదరులు చిన్న పిల్లలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, వున్న వారు స్వీట్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎం పి పి సంజీవ్ కుమార్ , జెడ్ పి టి సి బాబురావు, తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ మార్కెట్ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ, సర్పంచులు పెసర వెంకటమ్మ, గజ్జెల సుశీల, తోట లక్ష్మణ్,టి ఆర్ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ , జిల్లా నాయకులు సుదర్శన్ గౌడ్ , జిల్లా ఉపాద్యాయుడు నవీన్ జైస్వాల్ ,ఉప సర్పంచ్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్లు పల్లె రాజేశ్వర్, మధునయ్య, టౌన్ అధ్యక్షుడు అశోక్, ఎం శ్రీనివాస్, మోడెం చిరంజీవి గౌడ్, ఎస్ వి ఇంగ్లిష్ మీడియం కరస్పాండెంట్ ఢీకొండ విజయ కుమారి , హెడ్ మాస్టర్ సంజీవ్ కుమార్ , ఫాస్టర్లు బాబు రావు , జేరిమియా , రాజ రత్నం,మనఃహార్, తిమోతి, విజయ్ ' జాషువా, మంజుల, తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment