ఉపాధి పనులపై ప్రజా సమీక్షా సమావేశం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేద్రం లో గురువారం ఎంపిడిఓ కార్యాలయం లో డి ఆర్ డి ఓ పిడి శంకర్ సమక్షం లో మండల ఉపాధి హామీ పనులు ప్రజా వేదిక సమావేశాన్నీ నిరవహించారు ఈ సమావేశంలో పలుగురు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లు ,ఉపాధి కూలీలు మాట్లాడి సమస్యలను మరియు పనివివరాలను వెల్లడించారు . ఈ సమస్యల వివరాలలో పలుగురు బిపిఎమ్ లు ఉపాధి కూలి వేతనాలు చెల్లింపులలో అవకతోకలు చేసి అక్రమాలకు పలుపడుతున్నలట్లు కూలీలు పేర్కొన్నారు. పిడి శంకర మాట్లాడుతూ అక్రమాలకు పాలు పడ్డ బిపిఎం లపై తగిన విచారన జరిపించి ఫై అధికారులకు జాబితాలను పంపించి చర్యలు తీసుకుంటాం అన్నారు అలానే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు మేట్లు పనిచేస్తున్న కూలీలా జాబితా లను నమోదు చేయక వారి వేతనాలను అందించక పోవడం ఫీల్డ్ అసిస్టెంట్ మరియు మేట్లు , టెక్నీషన్ లు ఎలాంటి తప్పి ధాలను జరగకుండా చూడాలని సూచించారు . ఈ కార్యక్రమంలో ఎం పి పి కర్నాథం సంజీవ్ కుమార్ జ డ్ పి టి సి బాబురావు తహసిల్దార్ రమేష్ గౌడ్, ఎండిఓ సత్యనారాయణ్ సింగ్, ఎ పి ఎమ్ రాజ్ కుమార్ వెంకటరమణ, ఎ పి ఓ కల్పనా, మండల సర్పంచులు , ఎంపిటిసిలు మరియు ఉపాధీ హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment