కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లోని గోలేటి టౌన్ షిప్ లో భీమన్న స్టేడియం లో శనివారం క్రికెట్ పోటీలను డిజిఎం పర్సనల్ చిత్ రంజాన్ కుమార్ ప్రారంభించారు . ఈ సందర్బంగా క్రీడాకారులని పరిచయంచేసుకొని వారి మనోభావాలను అడిగి తెలుసు కున్నారు . తొలుతగా బరిలోకి క్రికెట్ బ్యాటు తో ఆటను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ కార్మికులు ఉద్యోగ రీత్యా ఒత్తిడ్లు ఉంటాయని అందుచే మాసిక ఉల్లాసం కోసం క్రీడలను ప్రోత్సహిస్తూన్నాం అన్నారు . అలాగే సింగరేణి కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ విద్య, వైద్యం,యోగ , క్రీడా కార్యక్రమాలను చేపడుతూ అభివృద్ధి చేస్తున్నాం అన్నారు . ఈ కార్యక్రమములో డి వై పి ఎం సుదర్శన్ , స్పోర్ట్ సూపర్వైజర్ ర్సమేష్ లు ఉన్నారు.
No comments:
Post a Comment