కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి); జిఓ ప్రకారం వేతనాలు చెల్లించకుండా తక్కువ వేతనం చెల్లించడం సరికాదని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చెరర్లు శ్రీనివాస్ ,గంగాధర్ ,ప్రకాష్ ,ప్రవీణ్ ,అమరేంధేర్ ,మంజుల ,జాన్సీ ,దీప్తి,నిర్మలలు ఆరోపించారు . వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అద్యపకుల జీతం 27000 చేయడానికి విద్య శాఖ ఆమోదం తెలపడాన్ని తీవ్రంగా కండిస్తున్నారు . వారికీ రావలసిన బేసిక్ మరియు డి ఏ చెల్లించాలని అన్నారు. గత ప్రభుత్వాలు పిఆర్ సి ని అమలు చేసిన వేంటనే మూలా వేతనాలను చెల్లించారు కానీ ఈ ప్రభుత్వం చెల్లించకపోవడం అవమాన కరం అన్నారు తెలంగాణ ప్రభుత్వం అమలులోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా చెల్లించకపోవడం తో కాంట్రాక్టు అధ్యాపకులు మనోవేదము వ్యక్తపరుస్తున్నారు . కాంట్రాక్టు అధ్యాపకులు లేక పోతే ఈ రోజు కలశాలలు మూతపడతాయని తెలిపారు వెంటనే క్రమ బద్దికరణ చేయాలనీ డిమాండ్ చేసారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కాంట్రాక్టు లెక్చెరర్ లపై చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు.
No comments:
Post a Comment