కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులపై చిన్న చూపు చూస్తూ సవతి తల్లి ప్రేమ వొలక పోస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం రవీందర్ తెలియజేశారు . ఈ సందర్బంగా రెబ్బెనలో విలేకరుల సమావేశంగా మాట్లాడుతూ విద్యార్థుల పోరాట ఫలితం ఎర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుతం విద్యార్థులనువిస్మరిస్తోందని అన్నారు .విద్యార్థులకు సంభందించిన ఫీజు రీఎంబెర్మెంట్ ,స్కాలర్ షీప్స్ విడుదల చేయకుండా జాప్యం చేస్తుందని ,దాని వలన విద్యార్థులు ఫీజు కట్టలేక అధిక ఇబ్బందులకు గురైతున్నారన్నారు . వసతి గృహాలకు వార్డెన్లు ,వాచ్ మెన్ లు ,కామటి పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహించడం తో విద్యార్థుల సంఖ్యా తగ్గి వసతి గృహాలు మూసి వేతకు సిద్దమౌతున్నాయి ,అందుచే ప్రభుత్వం చర్య లు తీసుకొవాలన్నారు . విద్యారంగం ఫై ఈ నెల 7వ తేదినుండి జిల్లా వ్యాప్తంగా నిరసర కార్యక్రమాలు చేపడతామని తెలిజేశారు ఈ కార్యక్రమం లో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్య వర్గ సభ్యులు కస్తూరి రవి ,డివిజన్ కార్యదర్శి సాయి ,మండల నాయకుల మహిపాల్ ,ప్రదీప్ ,పార్వతి సాయి ,గౌతక సందీప్ తడిఆతరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment