Wednesday, 19 July 2017

విద్యార్థులకు శాపంగా మారిన రోడ్లు

విద్యార్థులకు శాపంగా మారిన రోడ్లు 

ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 19;   రెబ్బెన మండల కేంద్రములో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ మురదమయము కావడముతో విద్యార్థులకు శాపంగా మారాయి .  3 సంవత్సరాల  కాలంగా పాలకులు,  ప్రభుత్వ అధికారులు , మండల ప్రజా ప్రతినిధులు ఎన్నో హామీలు ఇచ్చారు . మర్చిపోతున్నారు . వర్షాకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . రైతులకు  , అంగన్వాడీ విద్యార్థులకు , ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఈసబ్  స్టేషన్ రోడ్ ఎంతో ముఖ్యం ఈ రోడ్ గుండా ప్రతి రోజు ప్రజలు నడుస్తూ వుంటారు . ఇప్పటికైనా విద్యార్థుల ఇబ్బందుల ను దృష్టిలో ఉంచుకొని రోడ్ బాగు చేయించాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు . 
తొగిటి లక్ష్మణ్ - పేరెంట్ 

బురదలో ప్రతి రోజు పిల్లలను తీసుకెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని , గతములో రోడ్ వేయిస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు,అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.

No comments:

Post a Comment