Saturday, 15 July 2017

కలెక్టరేట్ ముట్టడికి తరలిరం డి ; వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు

 కలెక్టరేట్ ముట్టడికి తరలిరం డి ; వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు

ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 15 ;    విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 19వ తేదీన తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలి రావాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం రోజున ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యాక్షులు సాయి అధ్యక్షతన జరిగిన రౌండ్ టెబుల్ సమావేశంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్ జిల్లా ఇంచార్జ్ కొండగోర్ల చంద్రశేఖర్,పి.డి.యస్.యు. జిల్లా ఇంచార్జ్ పాపారావు,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తిక్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంక్షేమ వసతి గృహ సమస్యలు పరిష్కరించాలని,కెజి టూ పిజి ఉచిత విద్యాను అందించాలని,కార్పొరేట్ ,ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యయ పోస్టులను భర్తీ చేయాలని,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యహ్న భోజనం అమలు చేయాలని తదితర విద్యారంగ సమస్యలపై కలెక్టరేట్ ముందు నిర్వహించే ధర్నాకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూదరి సాయికిరణ్ ప్రణయ్,భీమేష్,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment