జక్కులపల్లి లో రైతు సమగ్ర సర్వే
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 04 (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలం లోని జక్కులపల్లిలో గ్రామసభ మంగళవారం రెవిన్యూ మరియు వ్యవసాయశఖ అధికారులు సంయుక్తం గ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల పంటల వివరాలు,పంటభూముల వివరాలు సేకరించారు. రైతుల కోసం నిర్వహించే గ్రామా సభలకు తప్పకుండా రైతులు హాజరయ్యి సహకరించాలని కోరారు.భూముల పూర్తి వివరాలు తెలుసుకోవడానికి,భూముల క్రమబద్దీకరణ ఎంత శాతం వున్నదని తెలుసుకోవడం కోసం రైతు సమగ్ర సర్వే ఉపయోగపడిందని అన్నారు..గత నెల నిర్వహించిన రైతు సమగ్ర సర్వే లో రైతులందరూ నమోదు చేసుకోవడం జరిగింది,ఆ సందర్బంగా నమోదు చేసిన వివరాలు సక్రమమైనవ,కాదా అని పరిశీలించారు. అదే విధంగా వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు సమగ్ర సర్వే వివరాలను క్షున్నంగా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భీమేష్, గ్రామా రెవెన్యూ అధికారి ఉమ్లాల్, వ్యవసాయ అధికారిణి మంజుల వ్యవసాయ విస్తరణాధికారి అర్చన ,గ్రామంలోని రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment