రెబ్బెన 5 వ వార్డులో హరిత హరము
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 18; తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా 5 వ వార్డులో రోడ్డుకు ఇరు వైపులా మొక్కలు నాటారు.ఈ సందర్బంగా ఆసిఫాడ్ మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ శంకరమ్మ, నవీన్ కుమార్ జైస్వాల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన బృహత్తర కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యతగా మొక్కలు నాటుతూ సమాజ శ్రేయస్సు కు పాటుపడాలన్నారు.ఇప్పుడు నాటిన మొక్కలను సంరక్షిస్తే అవి రేపటికి వృక్షాలు అవుతాయని, సమస్త మానవాళికి ప్రాణాధారమైన స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో, అరుణ, సుగుణ,మధునమ్మ,పార్వతి, అనిత , తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment