Tuesday, 13 November 2018

బాలల హక్కుల పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 13 : బాలల హక్కుల  పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని రెబ్బెన మండల  అదనపు   డిపిఓ కిరణ్మయి అన్నారు మంగళవారం రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్  పాఠశాలలో  బాలల హక్కుల  దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఏడు నుంచి పధ్నాలుగు వరకు బాలల హక్కుల దినోత్సవాన్నినిర్వహించనున్నట్లు తెలిపారు.    బాలల  హక్కులపై  కనీస అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపడుతున్నామని పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు అందరూ తప్పనిసరిగా పాఠశాలలకు హాజరుకావాలన్నారు.  అంతకాకుండా బాల్య వివాహాలు  చేసుకోరాదని అన్నారు.   తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులలో   చిన్న పిల్లలను పనుల్లో పెట్టరాదు ఎవరైనా బాలల చట్టాలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా  చట్టాల ఉల్లంఘన జరిగితే  సమాచారం ఇవ్వాలన్నారు .  విద్యార్థులకు వ్యాసరచన మ్యూజికల్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్  చిట్టెమ్మ,  కవిత,  పాఠశాల ఉపాధ్యాయులతో పాటు అంగన్వాడి టీచర్లు బాలమ్మ చంద్రకళ సాంబలక్ష్మి తిరుమలమ్మ భూదేవి రాధా తితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment