Saturday, 3 November 2018

పోలీస్ ఉద్యోగార్థులకు రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారికీ ఉచిత శిక్షణ

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 3 : రాతపరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సై, కాన్స్టేబుల్   అభ్యర్థులకు సింగరేణి సంస్థ ఇచ్చే  ఉచిత శిక్షణ  కార్యక్రమాన్ని   శనివారం  రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్  భీమన స్టేడియంలో జీఎం  కే రవిశంకర్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ  రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేహ ధారుడ్య పరీక్షా నిమిత్తం వివిధ ఈవెంట్లలో సుశిక్షితులైన శిక్షకులచే శిక్షణ  ఇప్పించడానికి ఏర్పాట్లు చేశామన్నారు.   అభ్యర్థులకు ఉదయం గుడ్లు, పాలు అందించనున్నట్లు తెలిపారు.   శిక్షణ  ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుందన్నరు. అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిజిఎం  పర్సనల్ జ్ కిరణ్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్ రావు,స్పోర్ట్స్ సూపర్ వైజర్  రమేష్, కమ్యూనికేషన్ సెల్ కో ఆర్డినేటర్ కుమారా స్వామి తదితరులు ఉన్నారు 

No comments:

Post a Comment