Thursday, 22 November 2018

తెరాస మహిళా విభాగం నుంచి ఇంటింటా ప్రచారం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 22 : తెరాస మహిళా విభాగం నుంచి ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని గురువారం రెబ్బెన మండల కేంద్రంలో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ ఇంటింట బొట్టు కార్యక్రమాన్ని నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ అభ్యర్థి కోవాలక్ష్మి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సుదరంగా మాట్లాడుతూ రెబ్బెన గ్రామాన్ని కోవాలక్ష్మి దత్తత తీసుకుని మండల కేంద్రంలోని సుమారు రెండు కోట్లుకు పైగా అభివృద్ధి పనుల చేసారన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని అభిబుద్ధి పనులు తెరాస ప్రభుత్వం చేసిందని మళ్లీ ప్రజలు ఆదరించి తెరాసను గెలిపించాలని కోరారు. మహిళలకు అండగా ఉంటూ మహిళల సమస్యలెన్నో పరిష్కరించారని, కారు గుర్తుకే ఓ ఓటు వేసి మహిళలంతా అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

No comments:

Post a Comment