Tuesday, 20 November 2018

ప్రమాదాల నివారణకు సహకరించాలి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 20 : రోడ్ ప్రమాదాల నివారణకు  ప్రజలు సహకరించాలని ఎస్సై ఢీకొంది రమేష్ అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలో ప్రధాన రహదారికి ఇరవైపులా ఉన్న చిరు వ్యాపారస్తులు, కూరగాయల వర్తకులతో మంగళవారం  ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.  జాతీయ రహదారి కి దగ్గరగా  ఈ వ్యాపార సంస్థలు ఉండటం వలన  ట్రాఫిక్ కు అంతరాయమవుతుందని  ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. రెబ్బెన గ్రామ  పంచాయతీ కార్యదర్శితో, మండల తహసీల్దార్ తో మాట్లాడి ప్రత్యాన్మాయ   ఏర్పాటు చేస్తామని అన్నారు. వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. అలాగే  రెబ్బెన బస్సు స్టాండ్  ప్రయాణ ప్రాంగణంలో ఉన్న ఫ్లెక్సీలను తొలగించి, ప్రాంగణానికి ఎదురుగానున్న కొబ్బరి బోండాల బండిని తొలగించరు. 

No comments:

Post a Comment