కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 10 : కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 1,3,5వ సెమిస్టరు పరీక్షలు ఈ నెల 24నుండి ప్రారంభమౌతాయని కాకతీయ యూనివర్సిటీ కంట్రోలర్ అఫ్ ఎక్సమినేషన్స్ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమయం తక్కువగా ఉన్నందున విద్యార్థులు గమనించి పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. 1, 3 వ సెమిస్టరు పరీక్షలు మధ్యాహ్నం 2 నుండి 5 వరకు, 5 వ సెమిస్టరు ప్రొద్దున్న 9 నుండి 12 వరకు ఉంటుందని తెలిపారు.
No comments:
Post a Comment