Monday, 12 November 2018

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 14 న బాలల దినోత్సవం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 12 :  సింగరేణి సంస్థ కమ్యూనికేషన్ సెల్ ఆధ్వర్యంలో ప్రీతి ఏటా నవంబర్ 14 న బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నదిని , ఈ సందర్భంగా బాల బాలికలలో ప్రతిభా పాటవాలను, మరియు పోటీతత్వాన్ని పెంపొందించుటకై వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించనున్నామని డిజిఎం  పర్సనల్ జ్ కిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్, పెయింటింగ్, గ్రూప్ ఫోక్ డాన్స్, ఫాన్సీ డ్రెస్ కంపిటిషన్ తదితర విభాగాలలో సీనియర్, మరియు జూనియర్ గ్రూప్ లకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.  ఈ పోటీలు 13 వ తేదీన గోలేటిలోని సి ఈ ఆర్ క్లబ్ నందు జరుగునని తెలిపారు. కావున బాల బాలికలు ఈ పోటీలలో పాల్గొనాలని కోరారు.

No comments:

Post a Comment