కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 28 : మహాత్మా జ్యోతి బా పూలే 128 వర్ధంతి సందర్భంగా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో మాలి కులస్తులు గ్రామ మాలి సంఘం అధ్యక్షులు లెందుగురే జయరాం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. కులస్తులందరు అధిక సంఖ్యలో హాజరై నివాళు లర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎల్ బాపు రావు, కమిటీ సభ్యులు జి చంద్రయ్య, వాసబెత్ రావు, శంకర్, విలాస్, కే శంకర్, గుండయ్య, ఆనంద్ రావు, భీమయ్య, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రెబ్బెన మండల కేంద్రంలో ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులూ దుర్గం రవీందర్, బోగే ఉపేందర్, పూదరి సాయి, పర్వతి సాయి, రాయిలా నర్సయ్య తదితరులు , మహాత్మా జ్యోతి బా పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు.
No comments:
Post a Comment