Sunday, 11 November 2018

మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 11 :  మౌలానా అబ్దుల్ కలాం   ఆజాద్ జయంతి వేడుకలను ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో  ఘనంగా నిర్వహించారు.  ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. అనంతరం మాట్లాడుతూ జాతీయోద్యమంలో మహాత్మా గాంధీతో కలసి పనిచేశారని, స్వతంత్ర భారతావనిలో తోలి విద్యా శాఖా  మంత్రిగా పనిచేసారన్నారు. వలసవాద  అవసరాలకు రూపొందించిన విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి దేశీయ అవసరాలకు అనువైన విద్య సంస్కరణలను తీసుకొచ్చి అమ లు చేశారన్నారు. అందరికి సమానమైన అవకాశాలతో విద్యను అందించడానికి క్రషిచేశారన్నారు. స్వల్ప కాలం లోనే దేశంలో విద్యా రంగాన్ని మంచి స్థితికి తీసుకు వచ్చిన మహానేత అని కొనిపోయాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లేష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment