కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 13 : గత ఎనిమిది నెలల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రామ పంచాయితీ కార్యదర్శి వేతనాలు చెల్లించడంలేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ఆరోపించారు. మంగళవారం రెబ్బెన ఎంపీడీఓ కు ఈ విషయం పై వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. పంచాయతీ కార్మికులకు 8 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. కార్మికులు, కుటుంబ సభ్యులు పస్తులుండవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కావున ఎంపీడీఓ ఈ విషయం పై కలుగ చేసుకొని జీతాలను త్వరగా చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కానీ పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామా పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు రాచకొండ రమేష్, ఉపాధ్యక్షులు లాల్ సింగ్, గోగర్ల శంకర్, ఎల్లల పోశం, కార్యదర్శి దుర్గం వెంకటష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment