కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 22 : రెబ్బెన మండలం నవేగం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గత 15 రోజులుగా పిల్లలకు భోజనం , గుడ్లు ఇవ్వడం లేదని పిల్లల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.. తమ పిల్లలు ఇంటినుండి అంగన్వాడీ కేంద్రానికి భోజనం తీసుకోని వెళ్లి మధ్యాహ్న సమయంలో తింటున్నారని , వారికి ఇవ్వవలసిన గుడ్లు, భోజనం నిర్వాహకులు అందచేయడం లేదని అన్నారు. సంభందిత అధికారులు తక్షణం స్పందించి అంగన్వాడీ కేంద్రంలో అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కే తానుబాయి , వనజ, మహాత్మా, రేణుక, ఎం రాకేష్, భీంరావు, సతీష్, ఆనంద్, బోరుకుతే శ్యామ్ రావు, ఆనంద్, పిల్లల తల్లి తండ్రులు తదితరులు కోరారు.
No comments:
Post a Comment