Thursday, 22 November 2018

అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందని గుడ్లు, భోజనం

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 22 : రెబ్బెన మండలం నవేగం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గత 15 రోజులుగా పిల్లలకు భోజనం , గుడ్లు ఇవ్వడం లేదని పిల్లల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం  చేశారు.. తమ పిల్లలు  ఇంటినుండి అంగన్వాడీ కేంద్రానికి భోజనం  తీసుకోని వెళ్లి మధ్యాహ్న సమయంలో తింటున్నారని , వారికి ఇవ్వవలసిన గుడ్లు, భోజనం నిర్వాహకులు అందచేయడం లేదని అన్నారు. సంభందిత అధికారులు తక్షణం స్పందించి అంగన్వాడీ కేంద్రంలో అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని    కే తానుబాయి  , వనజ, మహాత్మా, రేణుక, ఎం రాకేష్, భీంరావు, సతీష్, ఆనంద్, బోరుకుతే శ్యామ్ రావు, ఆనంద్, పిల్లల తల్లి తండ్రులు  తదితరులు కోరారు.

No comments:

Post a Comment