కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 28 : పతంజలి యోగ హరిద్వార్ వారి ఆధ్వర్యంలో రెబ్బెన మండలం నారాయణ పూర్ గ్రామంలో ఐదురోజుల ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుందని దాసరి వినోద్ గౌడ్ ఈ శిబిరం డిసెంబర్ 1 వ తారీకు నుండి 5వ తారీఖు వరకు ఉదయం సమయం 5 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా చేయడం వల్ల శారీరకంగా ఆరోగ్యంగ ఉంటామని మానసికంగా ప్రశాంతంగా ఉంటారు అని అన్నారు.ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. . ఈ కార్యక్రమంలో గ్రామ వాసులు రవీందర్ , మైలారం వెంకటేశం , తనుకు జగదీష్, తనుకు మురళి , తనుకు తిరుపతి , తనుకు రామన్న , బోనగిరి రమేష్ , రాయల శ్రీనివాస్ , గజ్జల సుజన , గజ్జల శ్రీశైలం ,పుల్లూరు వసంత , దేవినేని ప్రహ్లాద్, ఆర్ఎంపీ డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment