Saturday, 17 November 2018

అత్యాచార దోషులను ఉరికంబం ఎక్కించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 17 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి  మండల కేంద్రంలో శ్రీరాముల సంధ్యపై అత్యాచారానికి పాల్పడి అతి కిరాతకంగా హత్యచేసిన దోషులను ఉరికంబం  ఎక్కించాలని రెబ్బెన మండల నాయీ సంఘం అధ్యక్షులు కళ్యాణం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలో ని అతిధి గృహ ఆవరణలో జరిగిన నాయి బ్రాహ్మణా సంఘ సమావేశంలో మాట్లాడుతూ బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయలు, 2 ఎకరాల భూమి, కుటుంబంలో అర్హులైనవారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తకొండ మల్లేష్, గైక్వాడ్ నాగరాజ్, కళ్యాణం తిరుపతి, పంజార్ల వెంకటేష్, కుదురుపాక సురేష్, ప్రభాకర్, పాల్గొన్నారు. ఈ నిరసనకు ఎం అర్  పి  ఎస్ మండల అధ్యక్షులు బొంగు నర్సింగ రావు, ఏ  ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోగర్ల రాజేష్, మాల మహానాడు తరపున ఎర్ర మల్లేష్, విద్యార్థి విభాగం తరపున ధర్మా రావు తదితరులు మద్దతు తెలిపారు.

No comments:

Post a Comment