కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 22 : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రెబ్బెన మండలంలోని పాఠశాల ల విద్యార్థులకు ఈ నెల 24 న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుందని టివివి జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టెస్టు ఎనిమిది తొమ్మిది మరియు పదో తరగతి విద్యార్థులకు సైన్స్, గణితం , సాంఘిక, సమకాలిన సైన్స్ అంశాలపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు. . పాఠశాలల స్థాయిల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మండల స్థాయి పరీక్ష ఈ నెల 27 న ఉంటుందని, డిసెంబరు 16 న రాష్ట్రస్థాయి పరీక్షలు జనవరి 5, 6, 7 తేదీల్లో నిర్వహించబడుతుందని తెలిపారు.
No comments:
Post a Comment