Thursday, 22 November 2018

విద్యార్థులకు 24 న చెకుముకి టాలెంట్ టెస్ట్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 22 : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రెబ్బెన మండలంలోని   పాఠశాల ల విద్యార్థులకు ఈ నెల 24  న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుందని టివివి జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టెస్టు ఎనిమిది తొమ్మిది మరియు పదో తరగతి విద్యార్థులకు సైన్స్, గణితం  , సాంఘిక, సమకాలిన  సైన్స్ అంశాలపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు. .  పాఠశాలల స్థాయిల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మండల స్థాయి పరీక్ష ఈ నెల 27 న  ఉంటుందని,  డిసెంబరు 16 న  రాష్ట్రస్థాయి  పరీక్షలు జనవరి 5, 6, 7  తేదీల్లో నిర్వహించబడుతుందని తెలిపారు.

No comments:

Post a Comment