Thursday, 15 November 2018

మావోల సమాచారం అందించి పోలీసులకు సహకరించాలి ; డిఎస్పీ సత్యనారాయణ

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 15 :  మావోయిస్టుల యాక్షన్ టీమ్ కు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం  అందించి జిల్లాల్లో విధ్వంసాలు జరగకుండా ప్రజలు సహకరించాలని డి ఎస్పీ సత్యనారాయణ అన్నారు.  గురువారం రెబ్బెన పోలీస్ స్టేషన్లో సిఐ రమణమూర్తి, ఎస్సై దీకొండ రమేష్ లతో  కలిసి మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు పోస్టర్లను విడుదల చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ  అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని విధ్వంసాలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు మావోయిస్టు యాక్షన్ టీం సంచరిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. దాంతో పోలీసు శాఖ అప్రమత్తమై యాక్షన్ టీం సభ్యులతో కూడిన గోడపత్రులను అన్ని గ్రామాల్లో అంటిస్తున్నామన్నారు. గ్రామాల్లో యాక్షన్ టీమ్ సభ్యులకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారికి అయిదు లక్షల పారితోషకం అందజేస్తామన్నారు.  అలాగే సమాచారం తెలిపిన వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు గ్రామాల్లో ప్రజలు యాక్షన్ టీమ్ సభ్యుల పట్ల అప్రమత్తంగా ఉండి జిల్ల లోని విధ్వంసాలు జరగకుండా సహకరించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంతంగా ముందు వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ ప్రయత్నిస్తుందని దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు. మావోయిస్టును గుర్తించేందుకు యాక్షన్ టీమ్ సభ్యులతో గ్రామాల్లో పోస్టర్లు నటిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

No comments:

Post a Comment