కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 3 : రెబ్బెన మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువును నవంబర్ 6 వరకు పెంచుతూ కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ జి వీరన్న ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రిన్సిపాల్ జాకీర్ , కోఆర్డనేటర్ పూదారి మల్లేష్ తెలిపారు ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్ సైన్స్ డిగ్రీ కళాశాల కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంలో నిర్వహిస్తున్న కోర్సులను ప్రవేశానికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అంగన్వాడి కార్యకర్తలు యువతి యువకులు అర్హులను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
No comments:
Post a Comment