కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 17 ; (వుదయం ప్రతినిధి) ; రెబ్బన మండలం లోని తుంగడ గ్రామంలో గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారులను బుధవారం లక్కీ డ్రా ధ్వర ఎంపిక చేసారు. తహశీల్ ధర రమేష్ గౌడ్ . ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం గొల్ల కురుమలు ఆర్థికంగా కుటుంబాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రతి గొల్లకురుమ కుటుంబాలకు 70 శాతం రాయితీతో గొర్రె ల యూనిట్లను మంజూరు చేసిందని ఈ యూనిట్ లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుందన్నారు.తుంగడ గ్రామం లో నిర్వహించిన లక్కీ డ్రా లో 63 మంది లబ్దిదారులకు గాను 32 మందిని ఎంపికచేశారు. . ఈ కార్యక్రమంలో సర్పంచ్ జుమ్మిడి లక్ష్మి భాయ్. మండల పశు అధికారి సాగర్, పంచాయితీ కార్యదర్శి వంశీ కృష్ణ మాజీ జడ్పీటీసీ పల్లె ప్రకాష్ రావు . మాజీ సర్పంచ్ పి పర్వతాలు మరియు తదితర గొల్ల కురుమలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment