Saturday, 20 May 2017

యాదవుల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్ద పీఠ

యాదవుల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్ద పీఠ  

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 20 ; (వుదయం ప్రతినిధి) ; యాదవుల సంక్షేమానికి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద పీఠ వేసిందని  ఎంపిపి సంజీవ్ కుమార్ అన్నారు. యాదవులకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఫై  గొర్రల పెంపకానికి కి రెబ్బన మండలం లోని  గోలేటి  లో శనివారం 122 మంది  లబ్ది  దారులు దరఖాస్తులు చేసుకోగా మొదట విడతగా లాటరీ పద్దతి ద్వారా 50 శాతం లబ్ది దారులను ఎంపిక చేసారు.  గోలేటి  గ్రామ పంచాయితీలో  ఏర్పాటు చేసిన  గ్రామసభ లో ముఖ్య అతిధిగా ఎం పి పి సంజీవ్ కుమార్, జపిటీసీ అజ్మేర బాబురావు లు హాజరు అయి  మాట్లాడారు. ఒక్కొక్క యానిటీ కి 1. 25 లక్షల ఖర్చు అవుతుండగా ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అందిస్తుందని అన్నారు. యాదవుల గొల్ల కూర్మ లు తెలంగాణ సర్కారు ఇచ్చిన గొర్రెలను సంరక్షించుకొని ఆర్థికంగా ఎదగాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం  అన్నారు.   లాటరీ ద్వారా  లబ్దిదారులను  ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం లో  సర్పంచ్సర్పంచ్ తోట లక్ష్మణ్ ,ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్, పశువైద్యాధికారి సాగర్. ఏఎంసీ వైస్ చేర్మెన్ కుందారపు  శెంకరమ్మ. ఉప సర్పంచ్ రవి నాయక్, తెరాస మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి. ఎంపీటీసీలు  మురళి భాయ్. వనజ . రంగు శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment