Thursday, 11 May 2017

భూసార పరీక్షలతో అధిక దిగుబడులు సాధించొచ్చు ; ఏ ఓ మంజుల

భూసార పరీక్షలతో అధిక దిగుబడులు సాధించొచ్చు ; ఏ ఓ  మంజుల

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 11 ; (వుదయం ప్రతినిధి) ;  రైతులు వ్యవసాయ భూసార పరీక్షలు చేయించుకోని భూమికి కి అనుకూలంగా  పంటలను సాగు చేస్తే  అధిక దిగుబడులను సాధించొచ్చని  మండల వ్యవసాయాధికారిణి మంజుల అన్నారు. గురువారం  రెబ్బెన మండలంలోని కొండాపల్లి   గ్రామంలో  మన తెలంగాన-మన వ్యవసాయం అవగాహన సదస్సులో వ్యవసాయాధికారిణి మంజుల రైతులకు  అవగాహనా కల్పించారు.  ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ కోరకు సబ్సిడీపై అందించే పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  రైతుల దృష్టిని సాంప్రదాయ పంటలవైపు మళ్లించేందుకు  తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నందున జిల్లాలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని  పంటలను సాగు చేయాలనె క్రమంలో  రైతులకు  చైతన్యపర్చేందుకు మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమంలో వ్యవసాయాదికారులు ఊరురా రైతులను చైతన్యపరుస్తున్నారు.  ఆధునిక పద్దతి లో మెలుకువలు పాటించి, సేంద్రియ ఎరువులు వాడడం వల్ల  వ్యవసాయంలో  అదిక దిగుబడి సాదించాలని రసాయన ఎరువులను వాడితే బుసారం దెబ్బతిని దిగుబడులు తక్కువకు కారణం అవుతాయి అని అన్నారు. రైతులు , పాడిపశువుల పెంపకం చేపట్టి ఆర్థికంగా ప్రగతి పథంలోకి సాధించాలని కోరారు.  ఈ సదస్సులో  గ్రామ సర్పంచ్ మంతు మేరా, ఏ ఈ ఓ మార్క్  తదితర రైతులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment