తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం ; జి ఎం రవిశంకర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 22 ; (వుదయం ప్రతినిధి) ; తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని బెల్లంపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ కే. రవిశంకర్ అన్నారు. రెబ్బెన మండలంలోని గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయంలో సోమవారం సింగరేణి అధికారులకు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పండుగ వాతావరణం మధ్య ఘనంగా నిర్వహించుకోవాలని అధికారులకు సూచించారు సింగరేణి ప్రతి డిపార్టుమెంటల్ లో కూడా అందరు వేడుకలను జరుపుకోవాలన్నారు . ఆవిర్భావ దినోత్సవం రోజున ఉదయం 7:30 గంటలకు జి ఎం కార్యాలయం నుండి తెలంగాణ రన్ కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే బెల్లంపల్లి ,మాదారం, గోలేటిలలో మహిళలకు ప్రత్యేకంగా ఆటలాపోటీలు మరియు దీపాలంకరణ పోటీల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సింగరేణి పాఠశాల ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. సింగరేణికి సంబందించిన స్టాల్స్ తో పాటు తెలంగాణ వంటకాల స్టాల్ లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకొని పండుగ వేడుకలను విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో డి జి ఎం పర్సనల్ జె. చిత్తరంజాన్ కుమార్, ప్రాజెక్ట్ ఆఫీసర్ సంజీవ రెడ్డి , మోహన రెడ్డి , దేవేందర్ ఎస్ ఓ టూ జి ఎం కొండయ్య , సీతారామ రావు , రామారావు , నర్సారెడ్డి ఏ రాజేశ్వర్ , ఎల్ రామశాస్ట్రీ , అశోక్ , యూనియన్ నాయకులూ ఎస్ తిరుపాతి , సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment