రైతుసర్వేను పర్యవేక్షించిన వ్యవసాయ జిల్లా అధికారి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 27 ; (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలంకొని వాంకులం గ్రామంలో శనివారం మండలవ్యవసాయ అధికారులు సమగ్ర రైతు సర్వే నిర్వహిస్తుండగా జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు సర్వే జరుగుతున్నతీరును పరిశీలించారు. రైతులవివరాలను ఏవిధమైన పొరపాట్లులేకుండా సమగ్రమైన సర్వే చేయాలనీ అధికారులకు సూచించారు . రైతులుకూడా సరియైన అధికారులకుఅందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీటీమ్ గురుమూర్తి ,మండల వ్యవసాయ అధికారిణి మంజుల,సహాయక వ్యవసాయ అధికారులు మార్క్,అర్చన తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment