Friday, 19 May 2017

కుష్ఠు నివారణ పై అవగాహన సదస్సు

కుష్ఠు నివారణ పై అవగాహన సదస్సు 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 19 ; (వుదయం ప్రతినిధి) ;   ; కుష్ఠు వ్యాధి నివారణ పై రెబ్బెన లోని కొండపల్లి  గ్రామములో సర్పంచ్  మాంతు మేర అధ్యక్షతన శుక్రవారం లేప్రో  సొసైటీ ఆధ్వర్యంలో  కుష్ఠు వ్యాధి పై డాక్టర్ శివరామ కృష్ణ       ఎస్ హెఛ్ జి గ్రూప్ మెంబర్స్ లకు   అవగా హన కల్పించారు .ఈ అవగాహనా సదస్సుకు ముఖ్య అతిధిగా లేప్రో  సొసైటీ పిఓ  రామానుజ చారి హాజరై మాట్లాడారు.  ఈ సందర్బంగా డాక్టర్ శివరామ కృష్ణ పాఠశాలల విద్యార్థులకు , గ్రామస్తులకు కుష్ఠు వ్యాధి , బోదకాలు వ్యాధి గురించి క్లుప్తంగా వివరించారు . ఈ కార్యక్రమములో  లేప్రో  సభ్యులు   స్వప్న , వార్డు మెంబర్లు ఎం తిరుపతి , మొండయ్య  ప్రజలు ఉన్నారు.

No comments:

Post a Comment