
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 08 : ఆదివాసీ కోలావార్ మన్నెవార్ ఆరాధ్యదైవం బిమదేవుడి జెండా పండుగను రెబ్బెన లోని అన్ని కోలావార్ గూడాల్లో ఆయా గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జండాలను ఎగరవేసారు .రెబ్బెన మండలం లో పులికుంట రోడ్ గ్రామంలో బిర్సా మారయ్య, పులికుంట కాలనీ లో గువ్వల సత్యనారాయణ, పులికుంట న్యూ కాలనీ లో దుర్గతి నాగయ్య, రేకుల గూడలో చింత మాట్లా నారాయణ, ఇందిరా నగర్ లో కుమ్మరి మల్లేష్, నక్కలా గూడా మీసాల లక్ష్మణ్, నంబాల పూదరి గణపతి, రాజారామ్ పూదరి శంకర్, కొమురవెల్లి మంజరి అశోక్, రాళ్ళపాడు మాది చిన్నయ్య, కొత్తగూడెం కోడిపె వెంకటేశం , ఎం టి ఆర్ నగర్ తెలం రామయ్య, ఖైరుగూడ కృష్ణ, తుంగేద నాయిని సంతోష్, ధర్మారం ఆత్రం భీంరావు లు మన్నెవార్ సంప్రదాయబద్ధంగా డోలు వాయిద్యాలతో నిర్వహించారని రెబ్బెన మండల ఆదివాసీ మన్నెవార్ సేవా సంఘం అధ్యక్షులు మైలారపు శ్రీనివాస్ రావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల ఎనిమిదో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు అన్ని ఆదివాసీ కో లం గూడల్లో భీమ దేవుడు జెండాలను ఎగురవేసి పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుర్గతి సుధాకర్, మండల ఉపాధ్యక్షుడు కోడిపె వెంకటేశం, మండల కార్యదర్శి బిర్సా పోషయ్యతదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment